రాయదుర్గం పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో బహిరంగ ప్రదేశాల్లో పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్టు చేసినట్లు పట్టణ యూపీఎస్ స్టేషన్ సీఐ సురేష్ బాబు తెలిపారు. ఆదివారం సాయంత్రం తమకు రాబడిన సమాచారం మేరకు పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించామన్నారు. మెత్తం ఆరుగురిని అరెస్టు చేసి వారి నుంచి రూ. 45, 530 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.