వేంపల్లె మండలంలోని అయ్యవారిపల్లె గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఐవైఆర్ పల్లె గ్రామానికి చెందిన రైతు కోడూరు చెన్నకేశవరెడ్డి ఈ నెల తొమ్మిదివ తేదీ అప్పుల బాధతో విషపు గుళికలు తిని ఆత్మహత్య కు పాల్పడ్డాడు.
అది గమనించిన వారి బంధువులు హుటాహుటిన కడపలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించడం జరిగింది. చికిత్స పొందుతూ ఆ రైతు ఈరోజు శుక్రవారం మృతి చెందినట్లు తెలిసింది. ఈ ఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.