జమ్మూకశ్మీర్ : బందిపోరా జిల్లా హాజిన్ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. హాజిన్ ప్రాంతంలో నలుగురు ఉగ్రవాదులున్నట్లు భద్రతా బలగాలకు సమాచారం అందింది. ఈ క్రమంలో బలగాలు కార్డన్సెర్చ్ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మరో ఇద్దరు ఉగ్రవాదులున్నట్లు తెలుస్తుంది.