జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. యూరీ సెక్టార్ లోని ఎల్ ఓసీ దగ్గర బలగాలపై దాడికి పాల్పడ్డారు. వెంటనే అలర్టయిన సైనికులు.. టెర్రరిస్టులపై కాల్పులు జరిపారు. భద్రతా బలగాల కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఎదురుకాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ముగ్గురు టెర్రరిస్టులు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. నిన్న యూఎన్ఓలో పాకిస్థాన్.. ఉగ్రవాద కేంద్రంగా మారిందటూ సుష్మా స్వరాజ్ ప్రకటన చేసి 24గంటలు గడవక ముందే మరోసారి తన బుద్ది చూపించుకుంది.