స్వచ్ఛతే సేవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఖాదీకి ప్రతి ఒక్కరు ఆదరించాలని, అక్టోబర్ 2 నుంచి ఖాదీ వస్ర్తాలపై ప్రత్యేక తగ్గింపు ధరలుంటాయన్నారు. ఇక స్వచ్ఛ్ భారత్ లో చురుగ్గా పాల్గొంటున్న శ్రీనగర్ కు చెందిన బిలాల్ దార్ ను ప్రత్యేకంగా అభినందించారు ప్రధాని. అమరవీరులైన భర్తలను స్పూర్తిగా తీసుకొని ఆర్మీలో చేరిన లెఫ్టినెంట్ స్వాతి మహదిక్, లెఫ్టినెంట్ నిధి దుబేలను మోడీ ఈ సందర్భంగా అభినందించారు. ఇక మన్ కీ బాత్ కార్యక్రమానికి మూడేళ్ల పూర్తైన సందర్భంగా దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు మోడీ. దేశ ప్రజలకు, తనకు మధ్యగా మన్ కీ బాత్ నిలిచిందన్నారు.