ఓ వ్యక్తిపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మండిపడ్డారు. ఢిల్లీలో ఈ రోజు నిర్వహించిన ఓ సెమినార్ లో బుల్లెట్ ట్రెయిన్ గురించి ఆయన ప్రసంగిస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ అంశంపై అరుణ్ జైట్లీ సీరియస్ గా ప్రసంగిస్తున్న సమయంలో ‘బుల్లెట్ ట్రెయిన్ ని హిందీలో ఏమంటారు?’ అని మంత్రిని సదరు వ్యక్తి ప్రశ్నించాడు. దీంతో, ఆగ్రహించిన అరుణ్ జైట్లీ.. ప్రసంగం మధ్యలో ఈవిధంగా అడ్డుతగలడం మంచిది కాదని, సీరియస్ గా ఉండాలంటూ ఆ వ్యక్తిని మందలించినట్టు సమాచారం. హిందీ భాషలో ప్రసంగించే సమయంలో మధ్యమధ్యలో ఇంగ్లీషు పదాలను ఎందుకు వినియోగిస్తున్నారంటూ సదరు వ్యక్తి జైట్లీతో అన్నట్టు సమాచారం.