ఉద్యోగుల చలో విజయవాడ కార్యక్రమం సంగతి ఏమోగానీ ఈ చదరంగంలో సామాన్య ప్రజలు మాత్రం నలిగిపోతున్నారు.నిత్యం మచిలీపట్నం నుండి విజయవాడకు వెళ్ళే ప్రయాణికులు (ఉద్యోగులు మినహాయించి) ఈరోజు ఉదయం నుండి అష్టకష్టాలు పడుతున్నారు. ఆర్.టి.సి. బస్సులు నిలిపివేయడం, ప్రయివేటు వాహనాలపై ఆంక్షలు విధించడంతో రోజువారీ పనుల నిమిత్తం వెళ్ళే ప్రయాణికులకు ఈరోజు చుక్కలు కనిపిస్తున్నాయి.ఇప్పటికే విజయవాడ లోని వివిధ అపార్ట్మెట్లు లోకి చేరుకున్న దాదాపు 60 వేల మంది ఉద్యోగులను ముందస్తుగా అదుపు చేయకుండా ఇప్పుడు హడావిడిగా ఈ ఆంక్షలు విధించడం వలన సామాన్య ప్రజలపై తీవ్ర బారం పడుతుందని ఆవేదన చెందుతున్నారు.ఉదయం నుండి మచిలీపట్నం బస్ డిపో నుండి విజయవాడ సర్వీసులు లేక రోగులు, వివాహాది శభకార్యాలకు వెళ్ళేవారు, కొనుగోలుదారులు, మరియు పలురకాల ప్రయాణికులు వెనుతిరుగుతున్నరు.బస్సుల నిలిపివేత పై ముందస్తు సూచనలు చేయకుండా తీసుకున్న నిర్ణయం పై ప్రజలు ప్రభుత్వాన్ని దుయ్యబడుతున్నారు