ఏపీ సర్కార్ తీసుకొచ్చిన పీఆర్సీ జివోలకు వ్యతిరేకంగా చేపట్టిన 'చలో విజయవాడ' కార్యక్రమం విజయవంతం అయ్యిందని ఉద్యోగ సంఘాలు తెలిపాయి. ఈ కార్యక్రమానికి ఉద్యోగులు, ఉపాధ్యాయులు భారీగా తరలివచ్చారని పేర్కొన్నాయి. ఉద్యమ కార్యాచరణలో భాగంగా ఎల్లుండి నుంచి పెన్ డౌన్ చేపడతాం అని ఉద్యోగులు తెలిపారు. ఈ నెల 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్తామని ప్రకటించారు. ఈ నెల 7వ తేదీ నుంచి సచివాలయ ఉద్యోగులు కూడా సమ్మెలో పాల్గొంటారని, డిమాండ్లు నెరవేర్చే వరకు ఉద్యమం ఆగదని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు.