గంజాయి స్మగ్లర్లు మంగళవారం నర్సీపట్నంలో బీభత్సం సృష్టించారు. ఏజెన్సీ ప్రాంతం నుంచి గంజాయితో కారులో వస్తున్న గంజాయి స్మగ్లర్లు పోలీసులు కళ్ళు కప్పే హడావిడిలో శ్రీ కన్య థియేటర్ వద్ద, పెదబొడ్డేపల్లి జరభేరి షో రూం వద్ద రెండు వాహనాలు ఢీ కొట్టి బీభత్సం సృష్టించారు. తర్వాత కారునో అక్కడే వదిలి వేసి చెరువు వైపు పారిపోతుండగా వెంటనే అప్రమత్తమైన ఎస్సై దివాకర్ పోలీసుల సాయంతో వారిని వెంబడించి పట్టుకొని స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. అనంతరం కారునో తనిఖీ చేయగా అందులో గంజాయి ప్యాకెట్లు లభ్యమయ్యాయి. స్టేషన్ లో గంజాయి స్మగ్లర్లను పోలీస్ అధికారులు విచారిస్తున్నారు.