కృష్ణా జిల్లా: అశోక్ నగర్ లోని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కార్యాలయం వద్ద రజకులకు స్వయం ఉపాధి చేసుకునేందుకు ఇస్త్రీ పెట్టెలు పంపిణీ కార్యక్రమం చేసారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొని లబ్ధిదారులకు ఇస్త్రీ పెట్టెలు పంపిణి చేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీసీ లను జగన్ మోహన్ రెడ్డి మోసం చేసారని గోరంత ఇచ్చి కొండంత ప్రచారం చేసుకున్నారని ఆరోపించారు. గత ప్రభుత్వం లో పెళ్లి కానుక ఇచ్చేవారని జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు పెళ్లి కానుక ఇచ్చిన దాఖలాలు లేవని విమర్శించారు. రాష్ట్రంలో 11 లక్షలకు పైగా రజకులు ఉంటే కేవలం 80 వేల మందికే సంక్షేమ పధకాలు ఇస్తున్నారని మండిపడ్డారు. గత ముఖ్యమంత్రి చంద్రబాబు బీసీ, ఎస్సి సబ్ ప్లాన్ ద్వారా ఎస్సి, బిసి ప్రాంతాలు అభివృద్ధి చేశామని గుర్తు చేసారు. కానీ నేటి ప్రభుత్వం ఒక్క అభివృద్ధి కూడా చేయలేదని దుయ్యబట్టారు. కార్పొరేషన్ లు ఏర్పాటు చేయడం తప్ప నిధులు ఇవ్వడం లేదని అన్నారు. పేదలను మరింత పేదవారిగా మారుస్తున్నారని గద్దె దుయ్యబట్టారు.