బి.సి, లను దళితులను టార్గెట్ చేసి పోలీసులతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వేధింపులకు పాల్పడుతున్నడని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద బాబు విమర్శించారు.
మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ డీ. జి. పి, ఐ. పి. ఎస్, నుంచి వచ్చాడా లేక వై. సి. పి, నుంచి వచ్చాడా అని ప్రశ్నించారు.
టిడిపి దళిత నేతలు గుడివాడ వెళ్తే కొడాలి నాని చంపుతామని బెదిరించాడు. కొడాలి నాని వ్యాఖ్యలు డి. జి. పి, కు చిలక పలుకులుగా ఉన్నాయా అన్నారు.
బుద్జా వెంకన్న మాటలు దేశద్రోహం గా వినిపించాయా, వెంకన్న మాటల్లో తప్పు ఏం లేదు.
కేవలం బుద్దా వెంకన్న బిసి వర్గియుడు కావడం తోనే అరెస్ట్ చేశారన్నారు. బిసిలు, దళితులే టార్గెట్ గా పోలీసులతో జగన్ వేదింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు.