చాలా మంది తమ పిల్లల పేర్లు వెరైటీగా పెట్టుకోవడం చూస్తుంటాం. బార్డర్ లో జన్మించాడని ఓ మహిళ తన శిశువుకు బార్డర్ అని పేరు పెట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఉత్తర్ప్రదేశ్లోని అమ్రోహా జిల్లాలో ఉపాధ్యాయుల అర్హత పరీక్ష(టెట్) రాస్తుండగా ఓ గర్భిణి ప్రసవించింది. దీంతో ఆ శిశువుకు ఆమె టెట్ అని పేరు పెట్టారు. నాన్పుర్ బిటా గ్రామానికి చెందిన రేణు దేవి ప్రభుత్వ ఉపాధ్యాయురాలు కావాలన్న ఆశతో చాలారోజుల క్రితం టెట్కు దరఖాస్తు చేసింది. ఆదివారం పరీక్ష రాస్తున్న సమయంలో పురిటి నొప్పులు రావడంతో ఆమెను అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆ పసివాడికి ‘టెట్’ అని నామకరణం చేశారు.