విజయనగరం: కొమరాడ మండలం లోని ఏనుగులు సంచారాం పై ప్రజలను అటవీశాఖ అధికారులు అప్రమత్తం చేశారు. మండలం లో గల మార్కొండపుట్టి మరియు గుణానపురం , కొత్తధుగ్గి గ్రామాలకు ఏనుగులు ముప్పు ఉందని కనుక ఆయా గ్రామాల ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తలపై టామ్ టామ్ వేయించారు. అలానే జియ్యమ్మవలస మరియు గరుగుబిల్లి మండలం లో గల బాసంగి, బాసంగి వలస మరియు వెంకటరాజపురం, గిజబ గ్రామాలను అటవీ ఏనుగుల గుంపు ఆకస్మాత్తుగా ఏ రాత్రి సమయంలో నైనా చొచ్చుకువచే ప్రమాదముందని అందరూ అప్రమత్తంగా ఉండాలని అన్నారు.