న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా మాజీ ఐఏఎస్ అధికారి సునీల్ ఆరోరా నియామకం అయ్యారు. అనంతరం సునీల్ ఎన్నికల సంఘం కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా అచల్ కుమార్ జోతి, కమిషనర్లుగా ఓమ్ ప్రకావ్ రావత్, సునీల్ ఆరోరా కొనసాగుతున్నారు. జులై నెలలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నజీం జైదీ పదవీ విరమణ పొందిన తర్వాత కమిషనర్ గా కొనసాగుతున్న అచల్ కుమార్ జోతి.. సీఈసీగా బాధ్యతలు స్వీకరించారు. కమిషనర్ పోస్టు ఖాళీగా ఉండటంతో సునీల్ ఆరోరాను కేంద్రం నియమించింది.