పార్టీ ఆదేశాల మేరకే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు రాజీవ్ ప్రతాప్ రూడీ చెప్పారు. పార్టీలో చురుగ్గా పని చేస్తున్న సమయంలో ప్రభుత్వంలో పని చేసే అవకాశం వచ్చిందని, కేంద్ర మంత్రిగా తన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించానన్నారు. ప్రధాని మోడీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తనకు ఏ బాధ్యతలు అప్పజెప్పినా నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రూడీ చెప్పారు.