కరోనా కొత్త వేరియంట్ 'ఒమిక్రాన్' వేగంగా వ్యాపిస్తోంది. ఇప్పటివరకు 20 దేశాలకు ఈ వేరియంట్ విస్తరించింది. సౌతాఫ్రికా కంటే ముందే నైజీరియాలో ఈ వేరియంట్ బయటపడినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని డబ్ల్యూహెచ్ఓ హెచ్చరికలు జారీ చేసింది. యూరప్ దేశాల్లో ఒమిక్రాన్ బారిన పడిన బాధితుల సంఖ్య 44 కి చేరింది. విదేశాల నుంచి నిన్న ఇండియాకు వచ్చిన ఆరుగురికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. దేశంలో ఇప్పటివరకు కొత్త వేరియంట్ కేసులు నమోదు కాలేదని అధికారులు చెబుతున్నారు. సౌదీ అరేబియా, యూఏఈ, అమెరికాలో మొదటిసారిగా 'ఒమిక్రాన్' కేసులు నమోదయ్యాయి.