టీమిండియా-న్యూజిలాండ్ మధ్య జరుగుతోన్న తొలి టెస్టు మ్యాచు భారత్ తొలి ఇన్సింగ్స్ లో 345 పరుగులు చేసిన విషయం తెలిసిందే. రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ దిగిన భారత్ పై కివీస్ బౌలర్ కైలీ జెమీషన్ బౌలింగ్ అటాక్ను ప్రారంభించాడు. మయాంక్ అగర్వాల్, ఛతేశ్వర్ పుజారా క్రీజులో ఉన్నారు. కాగా మూడో రోజు ఆటలో భాగంగా అక్షర్ పటేల్, అశ్విన్ అద్భుత ప్రదర్శనతో విలియమ్సన్ బృందాన్ని 296 పరుగులకే ఆలౌట్ చేసిన సంగతి తెలిసిందే.అయితే నేడు కివీస్ బౌలర్ టిమ్ సౌథీ టీమిండియాను దెబ్బకొడుతున్నాడు. వరుసగా రెండు వికెట్లు తీసి.. రహానే సేనను కష్టాల్లోకి నెట్టేశాడు. 51 పరుగుల వద్దే ఐదు వికెట్లు కోల్పోయింది. మయాంక్ అగర్వాల్ 17, శుభమన్ గిల్ 1, ఛటేశ్వర్ పూజారా 22, అజింక్యా రహానె 4, రవీంద్ర జడేజా 0 పరుగులకే ఔటయ్యారు. ప్రస్తుతం క్రీజులో శ్రేయాస్ అయ్యర్ 17, రవి చంద్రన్ అశ్విన్ 20 పరుగులతో ఉన్నారు. రెండో ఇన్నింగ్స్లో టీమిండియా స్కోరు 29 ఓవర్లకు 82/5 గా ఉంది.