ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖ జిల్లా భీమిలి మండలం గోరం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Aug 19, 2017, 06:20 PM

కట్టలు తెంచుకున్న ప్రేమోన్మాదానికి రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. తన ప్రేమను అంగీకరించలేదన్న ఆక్రోశంతో ఓ యువకుడు జరిపిన ఉన్మాద చర్యకు యువతి చనిపోయింది. తన అక్కను కాపాడే క్రమంలో ఆమె సోదరుడు తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం ఆ దాడికి పాల్పడిన యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖ జిల్లా భీమిలి మండలం టి.నగరపాలెంలో చోటు చేసుకున్న ఈ ఘటన జిల్లాలో సంచలనం సృష్టించింది. తగరపువలసకు చెందిన హరిసంతోష్‌ (20) కొంత కాలంగా తనను ప్రేమించాలంటూ రూప అనే (17) యువతి వెంట పడుతున్నాడు. అతడి ప్రేమను నిరాకరిస్తూ వచ్చిన ఆమె.. ఆ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పింది. దీంతో వాళ్లు ఆ యువకుణ్ని తమ అమ్మాయి వెంటపడొద్దంటూ హెచ్చరించారు.


తన ప్రేమను అంగీకరించలేదనే అక్కసుతో హరిసంతోష్.. శనివారం (ఆగస్టు 19) మధ్యాహ్నం ఆ యువతిపై దాడి చేశాడు. తమ్ముడు ఉపేంద్రతో కలిసి ఉన్న రూప ఒంటిపై కిరోసిన్‌ పోసి నిప్పటించి పారిపోయాడు. మంటల్లో కాలిపోయి ఆ యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అక్కకు అంటుకున్న మంటలు ఆర్పేసే క్రమంలో ఉపేంద్ర కూడా తీవ్రంగా గాయపడ్డాడు. అతణ్ని చికిత్స నిమిత్తం కేజీహెచ్‌‌కు తరలించారు.రూపపై కిరోసిన్‌ పోసి నిప్పటించిన తర్వాత హరిసంతోష్‌ అక్కడి నుంచి పరారై విజయనగరం జిల్లా గోకపేట వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. యువకుడి ప్రేమోన్మాదానికి కూతురు బలవడమే కాకుండా.. కుమారుడు ఉపేంద్ర పరిస్థితి విషమంగా ఉండటంతో ఆ కుటుంబం కన్నీటిపర్యంతమవుతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com