తిరుపతి: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 22 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 14 గంటల సమయం పడుతున్నది. శ్రీవారి ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతున్నది. కాలినడక భక్తులకు 3 గంటల సమయం పడుతున్నది. నిన్న శ్రీవారిని 80,248 మంది దర్శించుకున్నారు.