కిర్లంపూడి లో ముద్రగడ నివాసం నుండి ముద్రగడ కి పాదయాత్ర కి కాపులు కి రిజర్వేషన్లు కావాలని నల్ల బోర్డులు తో చంద్రబాబు కి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బయలు దేరారుమామూలు గానే మళ్ళీ పోలీసులు అనుమతి లేదు అని అడ్డుకోవడం తో ముద్రగడ మరొక సారి పోలీసులు కి ప్రశ్నలు తో స్పందించారు. ఇప్పటికైనా మా జాతికి పాదయాత్ర కి ఎప్పుడు అనుమతి ఇస్తారో చెప్పాలి అని గత 20 రోజులు నుండి అడుగుతున్నాము , పోలిస్ లు కనీసం సమాధానం చెప్పకుండా మీరు మా ముందు నిలబడి మమ్మల్ని అడ్డుకోవడం దారుణం అని పోలీసులు తో వాగ్వాదం పెట్టుకున్నారు. ముద్రగడ నివాసం గేటు బయట నల్లబోర్డులు తో చంద్రబాబు కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కాపు జేయిసి నేతలు వాసిరెడ్డి ఏసుదాసు ఆకులరామకృష్ణ గౌతుస్వామి ఆరేటి ప్రకాష్ తుమ్మల పల్లి రమేష్ గుండా వెంకటరమణ గోపు అచ్యుత రామయ్య తదితరులు పాల్గొన్నారు