రాష్ట్రంలో మరో ప్రతిష్టాత్మక పోరుకు రంగం సిద్ధమైంది. దాదాపు ఏడేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న కాకినాడ మున్నిపల్ ఎన్నికకు షెడ్యూల్ విడుదలైంది. నంద్యాల ఉప ఎన్నిక ఫలితం మరుసటి రోజే పోలింగ్ జరగనుంది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నెల 7 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్లకు చివరి తేదీ ఆగస్టు 10గా ప్రకటించారు.ఏపీ ప్రభుత్వం పలు సార్లు కార్పోరేషన్ ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తోంది. అయితే దీనిపై రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో కోర్టు సూచన మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కాకినాడ మున్సిపల్కార్పోరేషన్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. ఆగస్టు 29న పోలింగ్ జరగనుండగా సెప్టెంబర్1న ఫలితాలు ప్రకటించనున్నారు.
ముఖ్యమైన తేదీలు
నామినేషన్ల స్వీకరణ ప్రారంభం : 07-08-2017
నామినేషన్ల స్వీకరణ తుది గడువు: 10-08-2017
నామినేషన్ల పరిశీలన: 11-08-2017
నామినేషన్ల ఉపసంహరణ: 16-08-2017
పోలింగ్: 29-08-2017
ఫలితాల ప్రకటన : 01-09-2017