కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి చేదు అనుభవం ఎదురైంది. గుజరాత్ లోని వరదబాధితులను పరామర్శించేందుకు నేడు ఆయన బనస్కాంత తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా బనస్కాంతలో ఆయన వరద బాధితులను ఉద్దేశించి మాట్లాడుతుండగా కొందరు ఆయనకు నల్ల జెండాలు చూపిస్తూ, నిరసన వ్యక్తం చేశారు. దీన్ని గమనించిన రాహుల్ వారిని తన వద్దకు రానివ్వాలని కోరాడు. నిరసనకారులు కొంచెం ఆందోళనలో ఉన్నారని, తనకు ఎలాంటి భయం లేదని అన్నారు. కార్యక్రమం అనంతరం కొందరు వ్యక్తులు రాహుల్ కాన్వాయ్ లోని ఓ కారుపై రాళ్లు విసిరారు. దీంతో, ఆ కారు వైనుకవైపు అద్దాలు పగిలిపోయాయి.