ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొండపల్లి మైనింగ్, టీడీపీ నేతల హౌస్ అరెస్టు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jul 31, 2021, 10:09 AM

కొండపల్లి మైనింగ్‌పై నిజనిర్ధరాణకు వెళ్లేందుకు టీడీపీ ప్లాన్‌ చేశారు. అయితే ముందే పోలీసులు గ్రహించి…వారి ప్లాన్ ను భగ్నం చేస్తున్నారు. నిజనిర్ధారణ కోసం వేసిన కమిటీ సభ్యులను హౌజ్‌ అరెస్ట్‌ చేశారు. మాజీ మంత్రి నక్కా ఆనందబాబు, పొలిట్‌ బ్యూరో సభ్యుడు బొండా ఉమా, కొనకళ్ల నారాయణ, కొల్లు రవీంద్రను గృహనిర్బంధంలో ఉంచారు. పోలీసుల తీరుపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండపల్లి ప్రాంతంలో జరుగుతున్న మైనింగ్‌ను పరిశీలించేందుకు వెళ్లిన దేవినేని ఉమాపై పోలీసులు హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి రాజమహేంద్రవరం జైలుకు తరలించారు.ఈ నేపథ్యంలో కొండపల్లి అటవీ ప్రాంతంలో జరుగుతున్న మైనింగ్‌ వ్యవహారంపై టీడీపీ అధినేత చంద్రబాబు పది మంది పార్టీ నేతలతో నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యులు 2021, జూలై 31వ తేదీ శనివారం కొండపల్లి అటవీ ప్రాంతంలో మైనింగ్‌ తవ్వకాలను పరిశీలించాలని ప్లాన్‌ చేసుకుంది. అయితే పోలీసులు ముందస్తుగానే నేతలను గృహ నిర్బంధం చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com