ఉత్తర ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వేగంగా వెళ్తున్న ఓ బస్సు ఎదురుగా వస్తున్న లారీ ని ఢీకొంది. దీంతో బస్సు మొత్తం తుక్కుతుక్కయింది. బస్సులో ప్రయాణిస్తున్న 5 వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడిన వారిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు.