ఢిల్లీ: కర్నాటక మంత్రి డీకే శివకుమార్ కు చెందిన ఢిల్లీ నివాసాల్లో ఐటీ అధికారులు రూ. 7.5 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో గుజరాత్కు చెందిన 44 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రస్తుతం బెంగుళూర్లోని ఓ రిసార్ట్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో మంత్రి ఇండ్లల్లో ఐటీ దాడులు జరుగుతున్నాయి. మంత్రికి చెందిన సుమారు 39 ప్రాంతాల్లో ఈ సోదాలు సాగుతున్నాయి. మొత్తం 120 సభ్యుల ఐటీ బృందం ఈ దాడుల్లో పాల్గొన్నది. ఈ సోదాల సమయంలో సీఆర్పీఎఫ్ జవాన్లు కూడా ఉన్నారు.