పాట్నా : బీహార్ అభివృద్ధి కోసమే బీజేపీతో చేతులు కలిపినట్లు ఆ రాష్ట్ర సీఎం నితీష్కుమార్ స్పష్టం చేశారు. ఆ రాష్ట్ర సీఎంగా ఆరోసారి ప్రమాణస్వీకారం చేసిన అనంతరం నితీష్ మీడియాతో మాట్లాడారు. బీహార్ అభివృద్ధే తన ధ్యేయమని స్పష్టం చేశారు. బీజేపీతో పొత్తులో తప్పేమీ లేదన్నారు. బీహార్ అభివృద్ధికి నితీష్ తో పాటు బీజేపీ ప్రాధాన్యం ఇస్తుందని డిప్యూటీ సీఎం సుశీల్ మోదీ స్పష్టం చేశారు. బీహార్ అభివృద్ధి బీజేపీతో సాధ్యమన్నారు. ఎంతో ఉన్నతమైన స్థానానికి బీహార్ త్వరలోనే చేరుకోబోతుందన్నారు.నితీష్ కుమార్కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే. ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన సుశీల్ మోదీకి కంగ్రాట్స్ చెప్పారు. బీహార్ పురోగతి, శ్రేయస్సు కోసం కలిసి పని చేద్దామని మోదీ పిలుపునిచ్చారు. ఆర్జేడీకి గుడ్బై చెప్పిన నితీష్.. బీజేపీ ఎమ్మెల్యేల మద్దతుతో ఇవాళ కొత్తగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం విదితమే. గురువారం ఉదయం 10 గంటలకు నితీష్ కుమార్తో గవర్నర్ కేశరినాథ్ త్రిపాఠి ప్రమాణ స్వీచారం చేయించారు.