చెన్నై : మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం 2వ వర్ధంతి వేడుకలు తమిళనాడు రామేశ్వరంలోని పెయి కరుంబులో జరిగాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పెయి కరుంబులో కలాం విగ్రహాన్ని ఆవిష్కరించారు. కలాం విగ్రహాం వద్ద మోదీ పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. అనంతరం అక్కడ నిర్మించిన కలాం స్మృతి కేంద్రాన్ని ప్రారంభించారు. కలాం సందేశ వాహిని యాత్రను మోదీ ప్రారంభించారు. కలాం స్మృతి కేంద్రాన్ని డీఆర్డీవో ఏర్పాటు చేశారు.