ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ 73 మున్సిపాలిటీల్లో విజయం సాధించింది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు తేడా లేకుండా అన్నిచోట్లావైసీపీ హవా కనిపించింది. మొత్తం 11 కార్పొరేషన్లలో 11 వైసీపీ కైవసం చేసుకుంది. ఇక, ఓట్ల షేరింగ్ లోనూ వైసీపీ సత్తా చాటింది. సాధారణ ఎన్నికలతో పోల్చుకుంటే టీడీపీ పార్టీ భారీగా ఓట్లు కోల్పోయింది. మరోవైపు బీజేపీ, జనసేన పార్టీలు సాధారణ ఎన్నికల కంటే స్వల్పంగా ఓట్ షేర్ పెంచుకున్నాయి. ఓట్ల శాతం వివరాలు ఇలా ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ 52.63 శాతం, తెలుగేదేశం పార్టీ 30.73శాతం, బీజేపీ 2.41 శాతం, జనసేన 4.67 శాతం, సీపీఎం 0.81 శాతం, సీపీఐ 0.80 శాతం ఓట్లు సాధించాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ 0.62 శాతానికి పరిమితం కాగా.. బీఎస్పీ 0.09 శాతంగా.. మిగిలిన రిజిస్టర్డ్ పార్టీలు 0.44 శాతం.. ఇండిపెండెంట్స్ 5.73 శాతం ఓట్లు సాధించారు.. నోటాకు 1.07 శాతం ఓట్లు రావడం విశేషం.