ట్రెండింగ్
Epaper    English    தமிழ்

20 కేజీల టమాటాల కోసం 20 మంది మృతి

international |  Suryaa Desk  | Published : Thu, Mar 11, 2021, 03:08 PM

కేవలం గంపెడు టమాటల కోసం నైజీరియా దేశస్తులు కొట్టుకోవడం సంచలనం రేపుతోంది. ఈ ఘర్షణలో ఇప్పటి వరకు 20 మంది మృతి చెందారు. ఆఫ్రికా దేశమైన నైజీరియాలో టమాట బుట్ట కారణంగా ఘర్షణలు చెలరేగాయి. దేశం ఉత్తరం, దక్షణం అని రెండుగా విడిపోయింది. ఘర్షణల్లో ఇప్పటివరకు 20 మంది మరణించారు. గత నెలలో ఒక వ్యక్తి బుట్టలో టమాటలతో నైరుతి నగరమైన ఇబాడాన్లోని మార్కెట్‌కు వెళ్తుండగా ప్రమాదం జరిగి టమాటలు రోడ్డుపై పడి అంతటా వ్యాపించాయి. ఇది సమీపంలోని దుకాణదారులు, పోర్టర్‌లతో వాదనకు దారితీసింది. ఆ వాగ్వాదం కాస్తా ఘర్షణకు దారితీసి పోరాటంగా మారింది. ఈ సంఘటనకు సంబంధించిన వార్తను సోషల్ మీడియాలో పోస్ట్‌ చేయడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. దేశం ఉత్తర ముస్లింలు-దక్షిణాది క్రైస్తవులుగా విడిపోయింది. ఈ ఉద్రిక్తత సంఘటన జరిగిన 4 గంటల తర్వాత హింసాత్మక రూపాన్ని సంతరించుకున్నది. అనేక ప్రాంతాల్లో దుకాణాలపై దాడి చేసి పలువురిని అగ్నికి ఆహుతి చేశారు. ఈ హింసలో ఇప్పటివరకు 20 మంది చనిపోయారు. వేలాది మంది ఇళ్లను వదిలి పారిపోయారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com