తెలుగురాష్ట్రాల్లో రెండురోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలతో ఇరు రాష్ట్రాల్లోని జలాశయాలు నిండి నీటితో కళకళలాడుతున్నాయి. ఆంధ్రా లోని పట్టిసీమ, శ్రీశైలం, ప్రకాశం బ్యారేజ్, ధవళేశ్వరంల వద్ద, ఇటు తెలంగాణలోని నాగార్జునసాగర్, తాలిపేరు, సింగూరు ప్రాజెక్ట్, ఎల్లంపల్లి, కుమరంభీం ప్రాజెక్టులు సాధారణ నీటిమట్టం కన్నా ఎక్కువగా నిండి నిండుకుండలను తలపిస్తున్నాయి. వర్షాల రాకతో ప్రాజెక్టులన్నీ నిండటంతో రైతన్నలు పండుగ చేసుకుంటున్నారు. జలాశయాలన్నీ నిండుకుంటుండటంతో అధికారులు గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.