ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. లైంగిక వేధింపులు తట్టుకోలేక ఓ మహిళా ఎస్ఐ సూసైడ్ చేసుకుంది. ఎన్టీ న్యూస్ కథనం ప్రకారం.. వివరాలు ఇలా ఉన్నాయి. అనూప్ షహర్ కొత్వాలి పోలీస్ స్టేషన్ లో అర్జూ పవార్(30) అనే మహిళ ఎస్ఐ గా విధులు నిర్వహిస్తోంది. అద్దె ఇంట్లో ఒంటరిగా ఉంటున్న ఆమె ఇటీవల ఉరి వేసుకుని ఆత్మహత్యకి పాల్పడింది. అయితే తమ కూతురు లైంగిక వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకుందని మహిళా ఎస్ఐ అర్జూ తల్లిదండ్రులు ఆరోపించారు. ఇటీవల ఆమె మొబైల్ కు అసభ్యకరమైన మెసేజ్ ఏదో వచ్చిందని తెలిపారు. కాగా ఆమె మొబైల్ ఫోన్ లాక్ లో ఉందని పోలీసులు తెలిపారు. ఫోన్ లాక్ తెరిస్తే గాని.. అర్జూ ఆత్మహత్యకు గల కారణం ఏంటో స్పష్టంగా చెప్పలేమని పోలీసు అధికారులు వెల్లడించారు.