నంద్యాల : పట్టణాల్లో అంగన్వాడీలను ప్రీ స్కూళ్లుగా మారుస్తున్నామని మంత్రి నారాయణ అన్నారు. నంద్యాలలోని అంగన్వాడీ ప్రీ స్కూళ్లను మంత్రి నారాయణ పరిశీలించారు. అంగన్వాడీలను ప్రీ స్కూళ్లుగా మార్చాలని సీఎం సూచించారన్నారు. ప్రీ స్కూల్ నుంచే ఆంగ్ల మాధ్యమంలో విద్యనందించాలన్నది సీఎం సంకల్పమన్నారు. విద్యతోనే పేదల జీవితాల్లో వెలుగులు నింపవచ్చన్నారు. గత ప్రభుత్వాలు అంగన్వాడీ కేంద్రాలను పాలపొడి కేంద్రాలుగా మార్చేశాయన్నారు. భవిష్యత్లో అంగన్వాడీ ప్రీస్కూళ్లలో సీటు కోసం డిమాండ్ పెరుగుతుందన్నారు.