కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఆమోదించిన వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా శుక్రవారం దేశవ్యాప్తంగా రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇందులో భాగంగా తమిళనాడు రైతులు వినూత్నంగా నిరసన తెలిపారు. నేషనల్ సౌత్ ఇండియన్ రివర్ ఇంటర్లింకింగ్ ఫార్మర్స్ అసోసియేషన్ రైతులు తిరుచీలోని కలెక్టర్ కార్యాలయం వెలుపల బైఠాయించారు. మానవ పుర్రెలతో, చేతులు, మెడకు గెలుసులు వేసుకుని వినూత్నంగాను కొందరు రైతులు అర్ధనగ్నంగా నిరసన తెలిపారు. ఈ రైతులు గతంలో కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు విధానాలకు వ్యతిరేకంగా ఇలాంటి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు.