శ్రీకాళహస్తి అంబేద్కర్ విగ్రహం వద్ద వామపక్ష పార్టీల నేతృత్వంలో రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వ్యవసాయ నూతన చట్టాన్ని ఉపసంహరించుకోవాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వామపక్ష పార్టీ నాయకులు పుల్లయ్య రమేష్ గురవయ్య మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అన్నదాతలను నట్టేట ముంచే విధంగా కొత్త వ్యవసాయ చట్టాన్ని తీసుకువచ్చిందని ద్వజ మెత్తారు. రాష్ట్రంలోని వైసిపి తెలుగుదేశం పార్టీలు కూడా బిజెపికి వంతు పాడుతూ రైతు వ్యతిరేక విధానాలను అనుసరించడం తీవ్రంగా ఖండించారు.రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోకపోతే దేశ వ్యాప్తంగా ఉద్యమం తీవ్రస్థాయి లోన్చేస్తామని వామపక్ష పార్టీ నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు గంధం మణి గురవయ్య కుమార్ ఈశ్వరయ్య శివ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా కార్యదర్శి రామచంద్రయ్య ఐఎఫ్టియు నాయకులు జాకీర్ రత్న ప్రసాద్ ముని రాజా తదితరులు పాల్గొన్నారు