అమరావతి : ఉత్తర తమిళనాడు తీరానికి దగ్గరలో ఈశాన్య బంగాళాఖాతం ప్రాంతంలో ఈ నెల 20న అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతి, విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉపరితల ఆవర్తనాలు, అల్పపీడనం కారణంగా ఈ నెల 24వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని, కోస్తా, రాయలసీమల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదు కానుందన్నారు. అల్పపీడనం నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది.