పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజుకు సొంత పార్టీ షాక్ ఇచ్చింది. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎం జగన్ ఎంపీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్లమెంటు సమావేశాలలో అనుసరించాల్సిన వ్యూహాన్ని, అంశాలను వివరించేందుకు ఈ సమావేశాన్ని నిర్వహించారు. అయితే ఈ వీడియో కాన్ఫరెన్స్ కు రఘురామకృష్ణంరాజును ముందుగా ఏపీ భవన్ అధికారులు ఆహ్వానించారు.
ఆ తర్వాత ఫోన్ చేసి వీడియో కాన్ఫరెన్స్ కు హాజరు కావద్దని తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. దాంతో కంగుతిన్న రఘురామకృష్ణంరాజు ఇక ఇంటికే పరిమితమయ్యారు. ఇదిలా ఉంటే ఎంపీ రఘురామకృష్ణంరాజు స్వపక్షంలో విపక్షంలా మారారు. సొంత పార్టీపైనే తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. వైసీపీ ఎంపీలు..ఎమ్మెల్యేలు..మంత్రులు సైతం ఆయన పేరు చెప్తే చాలు తీవ్రంగా విమర్శల దాడికి దిగుతున్న సంగతి తెలిసిందే.