తెలుగు రాష్ట్రాలో సంచలనం సృష్టించిన విజయవాడ స్వర్ణ ప్యాలెస్ రమేష్ కోవిడ్ కేర్ సెంటర్ కేసులో జగన్ సర్కార్ కి ఊరట లభించింది. ఏపీ హైకోర్టు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. కేసు దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వానికి అనుమతి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. డా. రమేష్ను నిర్బంధంలోకి తీసుకోకుండా విచారణ చేసుకోవచ్చని సూచించింది. రమేష్ కూడా దర్యాప్తునకు సహకరించాలని కోర్టు ఆదేశించింది. ఇకపోతే డా. రమేష్ క్వాష్ పిటిషన్పై ఇటీవల హైకోర్టులో విచారణ జరిగింది.
డా. రమేష్తో పాటు హాస్పిటల్ ఛైర్మన్పై తదుపరి చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. అసలు స్వర్ణ ప్యాలెస్ను క్వారంటైన్ సెంటర్గా అనుమతిచ్చిన కలెక్టర్, సబ్ కలెక్టర్, డీఎంహెచ్వోలకు ఎందుకు బాధ్యులను చేయలేదని ధర్మాసనం ప్రశ్నించింది. ఘటనకు వారు కూడా బాధ్యులేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీంతో జగన్ సర్కార్ హైకోర్టు ఉత్వర్వులపై స్టే ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయించింది.