కరోనా సోకడంతో గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స తీసుకుంటోన్న విషయం విదితమే. ఆయన ఆరోగ్య పరిస్థితి ఇప్పటికీ విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. బాలు పాడిన పాటలను ఆసుపత్రిలో ఆయనకు వినిపిస్తున్నారని తెలిసింది. ఆయన ఉన్న వార్డులో ప్రత్యేక ఏర్పాట్లు చేసి ఆ పాటలను ఆడియో ద్వారా ప్రసారం చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు, బాల సుబ్రహ్మణ్యం భార్య కూడా కరోనాతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వారికి నిపుణులైన వైద్యుల బృందం చికిత్స అందిస్తోంది. బాల సుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుమారుడు చరణ్ ఎప్పటికప్పుడు వివరాలు తెలుపుతున్నారు.