గోదావరి ఉగ్రరూపంతో కోనసీమలోని లంక గ్రామాలు నీట మునిగాయి. ముంపుగ్రామాల్లో ప్రజలు నాటు పడవల్లో సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. లోతట్టు ప్రాంతమైన అరిగెలవారిపేట నీటి మునిగింది. దీంతో గ్రామస్తులను అధికారులు నాటు పడవలద్వారా పునరావాసకేంద్రానికి తరలిస్తున్నారు. పంటలన్నీ నీటమునిగాయి. ఏటుగట్లు కూడా బలహీనంగా ఉన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమై ప్రమాదం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.