శుక్రవారం అనంతపురం జిల్లా పెద్దకడబూరు మండలం స్థానిక తాసిల్దార్ ఆఫీసు నందు రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ధర్నా సందర్భంగా ఉల్లిగడ్డను గిట్టుబాటు ధర లేక రైతుల అసంతృప్తితో ఉల్లిగడ్డను తాసిల్దార్ ఆఫీసు నందు కాల్చారు. అనంతరం ధర్నా ఉద్దేశించి.. సీపీఐ మంత్రాలయం తాలూకా కార్యదర్శి బాస్కర్ యాదవ్ మాట్లాడుతూ.. పెద్దకడబూరు మండలంలో చిన్నతుంబలం, కల్లుకుంట, పెద్దకడబూరు, హెచ్. మురవని, దొడ్డిమేకల వివిధా గ్రామాలలో ఉల్లి పంటను చాలా ఎక్కువగా వేశారు. పండిన ఉల్లి పంటను తాడే పల్లె గూడెం కు తీసుకెళ్లడం జరుగుతుంది. అక్కడ కొనుగోలు దారులు రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా క్వింటం ధర కేవలం రూ.300 నుంచి రూ.350 నాణ్యతగల ఉల్లిగడ్డను తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు.ఈ రేటు రైతులకు గిట్టుబాటు కావడం లేదు, ప్రభుత్వం వెంటనే గిట్టుబాటు రూ. 2500 కల్పించాలి. దాని రైతులకు తమ పిల్లలు చదివించడానికి, తమ పిల్లలకు పెళ్లిళ్లు చేయడానికి వెసులుబాటు కలుగుతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను భాస్కర్ యాదవ్ డిమాండ్ చేశారు. అనంతరం ఎ.ఐ యస్.యఫ్ జిల్లా సమితి సబ్యులు రాజు, సీపీఐ మండల సమితి సభ్యులు వీరేష్, ముఖ్యంగా ఈ ధర్నా ఉద్దేశించి రైతు సంఘం మండల కార్యదర్శి రామాంజినేయులు మాట్లాడుతూ.. 2018, 2019 పంట నష్టపరిహారం రైతుల అకౌంట్ లో జమచేయాలని అన్నారు.అలాగే రైతులకు సంబంధించిన ఆర్.ఓ.ఆర్. ఆడంగాల పనులు మరియు ఈ పాస్ పుస్తకాల పనులు వేగవంతం చేసి అర్హత కలిగిన ప్రతి రైతుకు రైతు భరోసా వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ.. వెంటనే ఉల్లి రైతులకు గిట్టుబాటు కల్పించకపోతే పెద్దఎత్తున ధర్నా చేపట్టడానికైనా సిద్ధం అని రైతు సంఘం ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు. అనంతరం తాసిల్దార్ ఆఫీసు నందు ఆర్.ఐ.కి వినతిపత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఎ.ఐ.వై.యఫ్ మండల కార్యదర్శి సుంకన్న, ఎ.ఐ.వై.యఫ్. మండల అధ్యక్షులు గవిగట్టు వీరేష్, ఎ. ఐ.యస్.యఫ్. మండల కార్యదర్శి రామాంజినేయులు, రైతులు హనుమన్న, హనుమంతు, రామాంజినేయులు, ఈరన్న, నరసప్ప, ఉసేన్ భాష, తదితరులు పాల్గొన్నారు.