ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్ లో మరోసారి లాక్ డౌన్ పొడిగింపు?

national |  Suryaa Desk  | Published : Wed, May 27, 2020, 04:50 PM

దేశ వ్యాప్తంగా కరోనా ప్రభావంతో లాక్ డౌన్ 4 కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ 4లో భారీ సడలింపులు ఇచ్చిన విషయం తెలిసిందే. మే 31తో లాక్ డౌన్ 5 ముగుస్తుంది. దీంతో దేశంలో ప్రస్తుత పరిస్థితుల పై కేంద్రం సమీక్షించింది. దేశంలో లాక్ డౌన్ 5 అమలు చేయాలని కేంద్రం సూత్రాప్రాయంగా నిర్ణయం తీసుకుందని సమాచారం. లాక్ డౌన్ 5లో మరికొన్ని సడలింపులు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకునట్టు ఆలయాలు,ప్రార్దనా మందిరాలు తెరిచేందుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని సమాచారం. రాష్ట్రాల మధ్య రవాణాకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,51,767కు చేరింది. ఇప్పటి వరకు 64,426 మంది కోలుకొని డిశ్చార్జు కాగా 4337 మంది మరణించారు. మహారాష్ట్ర,తమిళనాడు,గుజరాత్,ఢిల్లీలలో కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉంది. మహారాష్ట్రలో 50 వేల కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం వివిధ దేశాలలో లాక్ డౌన్ అమల్లో ఉంది. ఇప్పుడు లాక్ డౌన్ ఎత్తేస్తున్నామని భారత్ ప్రకటిస్తే డబ్ల్యూహెచ్ వో నుంచి విమర్శలు వచ్చే అవకాశం ఉంది. అందుకే భారీ సడలింపులు ఇచ్చి పేరుకు మాత్రం లాక్ డౌన్ ను కొనసాగిస్తారని సమాచారం. జూన్ 15 వరకు లాక్ డౌన్ 5 కొనసాగే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com