ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కుండలో నీరు తాగితే అనేక ప్రయోజనాలు...

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, May 27, 2020, 04:52 PM

కుండలో నీళ్ళు చల్లబడడంతో పాటూ మినరల్స్, విటమిన్స్‌ని కలిగి ఉంటాయి. అందుకే, ఫ్రిజ్ లో చల్లబరిచిన నీటి కంటే కూడా కుండ లో చల్లబరిచిన నీటికి విలువ ఎక్కువ. ప్లాస్టిక్ బాటిల్స్ లో నీళ్ళు ఉంచడం ఆరోగ్యానికి మంచిది కాదు. ప్లాస్టిక్ లో బీపీఏ లాంటి టాక్సిక్ కెమికల్స్ ఉంటాయి. కానీ, మట్టి కుండ లో ఎలాంటి కెమికల్సూ ఉండవు. పైగా, ఆ నీరు మెటబాలిజంని బూస్ట్ చేస్తుంది. పైగా అందులో ఉండే మినరల్స్ వల్ల జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. కుండలో నీళ్ళు ఉంచడంలో ఒక పెద్ద ప్రయోజనం ఏంటంటే అది వేపరైజేషన్ పద్ధతిలో నీటిని సహజంగా చల్లగా చేస్తుంది. కుండకి ఉన్న చిన్న చిన్న రంధ్రాల వల్ల అందులోని నీటికి హీలింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. అందుకే ఫ్రిజ్‌లో పెట్టిన నీరు కంటే కుండలో చల్లబరిచిన నీటిని తాగడం ఆరోగ్యానికి చాలా మంచిది. ఒక్క వడదెబ్బ నుంచే కాదు, సమ్మర్ లో వచ్చే రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి కుండలో నీళ్ళు మనని రక్షిస్తాయి. అతి దాహం, ఒళ్ళు పేలడం వంటివి కుండలో నీళ్ళు తాగితే రావు. ఎందుకంటే, అందులో నీళ్ళు చల్లగా ఉండడమే కాదు, అవి శరీరాన్ని లోపలి నుంచి చల్లబరుస్తాయి. మట్టి కుండ నీటికి ఉన్న పీహెచ్ బాలెన్స్ ని మెయింటెయిన్ చేస్తుంది. అందువల్ల ఈ నీటిని తాగితే ఎసిడిటీ లాంటి గాస్ట్రిక్ సమస్యలు రాకుండా ఉంటాయి. రెగ్యులర్‌గా తాగడం వల్ల మరెన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ దూరం అవుతాయి. అంతేకాదు, ఇది అందరికీ అందుబాటు ధరలో ఈజీగా దొరుకుతుంది. అందుకే రెగ్యులర్‌గా ఈ నీటిని తాగడం చాలా మంచిది. కుండలో ఉన్న నీళ్ళు చల్లగా ఉండటమే కాదు, జెంటిల్ గా కూడా ఉంటాయి. అందుకని ఫ్రిజ్ లో నీళ్ళ లాగా ఇవి తాగితే దగ్గూ, జలుబూ రావు. ఆస్తమాతో బాధపడేవారికి ఈ నీటి వల్ల ఆ ప్రాబ్లం ఎక్కువ అవ్వకుండా ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com