కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ వైరస్ నుంచి బయటపడేందుకు దేశంలోని అన్ని ప్రభుత్వాలు ఫైట్ చేస్తున్నాయి. మార్చి 24 వ తేదీ నుంచి దేశంలో లాక్ డౌన్ విధించారు. లాక్ డౌన్ విధించిన కొన్ని రోజులవరకు కరోనా పాజిటివ్ కేసులు పెద్దగా పెరగలేదు. అయితే, గత రెండు రోజులుగా కరోనా కేసులు అనూహ్యంగా పెరగడం మొదలుపెట్టాయి.కరోనా కేసులు పెరిగిపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటె, కరోనాపై పోరుకు దేశంలోని ప్రముఖులు, వ్యాపారవేత్తలు విరాళాలు అందిస్తున్నారు. ఇప్పటికే అనేకమంది విరాళాలు అందించారు. తాజాగా ప్రాముఖ సాఫ్ట్ వేర్ సంస్థకు చెందిన అజీమ్ ప్రేమ్ జీ ఫౌండేషన్ రూ. 1125 కోట్ల రూపాయల విరాళం అందించింది. విప్రోతో పాటుగా టాటా, రిలయన్స్ తో పాటుగా అనేక సంస్థలు విరాళం అందిస్తున్నాయి.