గుంటూరు నగర పాలక సంస్థ కార్యాలయంలో ఏసీబీ తనిఖీలు కొనసాగుతున్నాయి. అవుట్ సోర్సింగ్ సిబ్బంది, టౌన్ ప్లానింగ్ అధికారుల వద్ద రూ 75 వేలు ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇవాళ ఉదయం నుంచి ఏపీలోని పలు మున్సిపాలిటీ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. విశాఖ జీవీఎంసీ టౌన్ ప్లానింగ్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహించారు. . విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ లో ఏసీబీ దాడులు చేసింది. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ ఆపీసులో సోదాలు చేసింది.