ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అయోధ్యలో సమాధులపై ముస్లింలకు క్లారిటీ ఇచ్చిన జిల్లా మెజిస్ట్రేట్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 18, 2020, 03:35 PM

అయోధ్య శ్రీరాముని చరిత్రలో చాలా ప్రాముఖ్యమున్న నగరము. శ్రీరాముడు ఈ నగరంలోనే జన్మించినట్లు చరిత్ర చెబుతోంది. అయోధ్య లో రామ మందిరానికి ఎన్నో సమస్యలు  వస్తున్నాయి . అందులో ఒక సమస్య జిల్లా కోర్ట్ ని ఆశ్రయించింది , అయోద్యలో ముస్లింల సమాధులు ఉన్నాయని రామాలయం ఎలా కడతారంటూ ‘రామ జన్మభూమి క్షేత్ర ట్రస్టు’కు శంషాద్ లేఖ రాసిన నేపథ్యంలో అనూజ్ ఝా వెంటనే వివరణ ఇచ్చారు.  రామ జన్మభూమిలో ఎలాంటి సమాధులూ లేవని అయోధ్య జిల్లా మెజిస్ట్రేట్ అనూజ్ ఝా స్పష్టం చేశారు.


రామాలయం నిర్మాణం చేపట్టనున్న 67 ఎకరాల స్థలంలో ఎక్కడా ఎలాంటి సమాధులు లేవని అనూజ్ ఝా చెప్పారు. ‘‘ఇప్పుడు లాయర్ షంషాద్ చేస్తున్న వాదన సహా అన్ని అంశాలను సుప్రీంకోర్టు తన విచారణ సమయంలో పరిశీలించింది. అప్పుడే కోర్టుకు అన్ని వివరాలు అందజేశాం. ఆయా అంశాల్లో నిజానిజాలేమిటన్నది స్పష్టంగా పేర్కొంటూ తీర్పు కూడా ఇచ్చింది. రామ జన్మభూమి ప్రాంతంలో ఎలాంటి శ్మశానం, సమాధులు లేవు. కోర్టు అన్నీ పరిశీలించాకే.. ఈ స్థలాన్నికేంద్ర ప్రభుత్వానికి అప్పగించింది. కోర్టు ఆదేశాల ప్రకారం మేం నడుచుకుంటున్నాం..” అని వివరించారు.


అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు’ మొదటి సమావేశం ఈ నెల 19వ తేదీన జరుగనుంది. ట్రస్టు బోర్డు సభ్యుడు, సుప్రీంకోర్టు లాయర్ కె.పరాశరన్ నివాసంలో జరిగే ఈ భేటీలో ఆలయ నిర్మాణానికి సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com