కేంద్ర ప్రభుత్వం, అస్సాం ప్రభుత్వం, నిషేధిత నేషనల్ డెమొక్రటిక్ ఫ్రంట్ ఆఫ్ బోడోలాండ్ (ఎన్డిఎఫ్బి)ల మధ్య నేడు త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. దీనిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా మాట్లాడుతూ నేడు బోడో ప్రతినిధులు, అస్సాం, కేంద్ర ప్రభుత్వాలు ఒక కీలక ఒప్పందంపై సంతకాలు చేశాయని చెప్పారు. కేంద్రం, అస్సాం ప్రభుత్వం, బోడోల్యాండ్ ప్రతినిధులు శాంతి ఒప్పందంపై సంతకాలు చేశారని ఆయన అన్నారు. ఈ ఒప్పందం వల్ల అస్సాం రాష్ట్రానికి, బోడో ప్రజలకు భవిష్యత్తు సువర్ణమయమవుతుందని ఆయన చెప్పారు.