మూడు ప్రాంతాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తీసుకువచ్చిన వికేంద్రీకరణ బిల్లును తెలుగుదేశం పార్టీ ఉద్దేశపూర్వకంగానే అడ్డుతగులుతోందని ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మండిపడ్డారు. మూడు ప్రాంతాల అభివృద్ధిని ప్రజలందరూ కోరుకుంటూన్నారు. ప్రజలందరూ బిల్లు ఆమోదం కోసం ఎదురుచూస్తుంటే టీడీపీ సభ్యులు దారుణంగా వ్యవహరించారని ఆరోపించారు. ఈ బిల్లు చర్చకు రాకూడదని రూల్ నెం.71 తీసుకువచ్చారని అయన అన్నారు. అసలు రూల్ రూల్ నెం.71 అనేది ఎవరికీ తెలియదని అయన అన్నారు. ఎంతో ప్రాముఖ్యత ఉన్న వికేంద్రీకరణ బిల్లు కోసం ప్రభుత్వం తరఫున తామే ఓ మెట్టుదిగి చర్చకు సుముఖత వ్యక్తం చేశామని తెలిపారు.