ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విమాన ప్రమాదంలో ఒక్కరూ బయటపడలేదు..!

international |  Suryaa Desk  | Published : Wed, Jan 08, 2020, 11:57 AM

ఈ తెల్లవారుజామున ఇరాన్ రాజధాని టెహ్రాన్ సమీపంలో ఉక్రెయిన్ కు చెందిన బోయింగ్ 737 విమానం కుప్పకూలిన సంగతి తెలిసిందే. టెహ్రాన్ లోని ఇమామ్ ఖొమైనీ విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్న కాసేపటికే ఈ ఘోర ప్రమాదం సంభవించింది. ఈ ప్రమదంలో విమానంలోని క్రూ సిబ్బందితో పాటు, మొత్తం 165 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు ఇరాన్ అధికార మీడియా సంస్థ ఐఎస్ఎన్ఏ ప్రకటించింది.


తెల్లవారుజామును 6.12 గంటలకు బోయింగ్ విమానం టేకాఫ్ అయింది. ఎనిమిది నిమిషాల అనంతరం అది నేలకూలింది. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రమాదాన్ని కళ్లకు కట్టినట్టు చూపెడుతోంది. ఓ బంతిలా మండుతూ విమానం కూలిపోయింది. నేలను ఢీకొని పెద్ద శబ్దంతో పేలిపోయింది.


ఈ ప్రమాదంపై ఇరాన్ ఎమర్జెన్సీ సర్వీసెస్ చీఫ్ మాట్లాడుతూ, మంటలు ఎక్కువగా ఉండటంతో... ఎవరినీ కాపాడలేకపోయామని తెలిపారు. ప్రమాదస్థలిలో 22 అంబులెన్సులు, 4 బస్ అంబులెన్సులు, ఒక హెలికాప్టర్ ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com