విశాఖలో కార్మిక సంఘాల సమ్మె కొనసాగుతోంది. కేంద్రం ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాలు దేశవ్యాప్తబంద్కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. విశాఖ స్టీల్ప్లాంట్ మెయిన్గేట్ దగ్గర కార్మికులు ధర్నా నిర్వహించారు. 30వేల మంది కార్మికులు విధులు బహిష్కరించి సమ్మెలో పాల్గొన్నారు. కార్మికుల ఆందోళనలతో భారీగా పోలీసులు మోహరించారు.