పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన చేపడుతున్న జామియా మిలియా ఇస్లామియా (జేఎంఐ) విద్యార్థుల ఆందోళనపై భారత పేసర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందించాడు. ''ఇలాంటి రాజకీయాలు జరుగుతూనే ఉంటాయి. నేను, నా దేశం జమియా విద్యార్థుల భవిష్యత్తు గురించి మాత్రమే ఆలోచిస్తుంది'' అని ట్వీట్ చేశాడు. ఆదివారం విద్యార్థులు చేపట్టిన నిరసనలతో దేశ రాజధాని దద్దరిల్లిన విషయం తెలిసిందే. ఆగ్నేయ దిల్లీలోని న్యూఫ్రెండ్స్ కాలనీలో జేఎంఐ విద్యార్థులు, స్థానికులు ఉమ్మడిగా చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారి ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘర్షణల్లో దాదాపు 60 మంది గాయపడ్డారు. నిరసనలను అదపుచేయడంలో భాగంగా పోలీసులు 50 మందిని అరెస్టు చేశారు. సోమవారం వేకువజామున వారిని విడుదల చేశారు. పౌరసత్వ సవరణ చట్టానికి నిరసనగా పశ్చిమబెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి.